గత 24 గంటల్లో 30.49 లక్షలకుపైగా డోసులు నిర్వహణ
ప్రస్తుత రికవరీ రేటు 98.46%
గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 14,148
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,48,359
వారపు పాజిటివిటీ రేటు 1.60%
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 30.49 లక్షలకు పైగా ( 30,49,988 ) డోసులతో కలిపి, 176.52 కోట్ల ( 1,76,52,31,385 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,01,49,530 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:
ఆరోగ్య సిబ్బంది | మొదటి డోసు రెండో డోసు ముందు జాగ్రత్త డోసు | 1,04,01,131 99,60,537 41,13,480 |
ఫ్రంట్లైన్ సిబ్బంది | మొదటి డోసు రెండో డోసు ముందు జాగ్రత్త డోసు | 1,84,08,724 1,74,30,375 60,92,569 |
15-18 ఏళ్ల వారు | మొదటి డోసు రెండో డోసు | 5,42,63,490 2,47,48,744 |
18-44 ఏళ్ల వారు | మొదటి డోసు రెండో డోసు | 55,10,97,609 43,99,93,963 |
45-59 ఏళ్ల వారు | మొదటి డోసు రెండో డోసు | 20,21,57,669 17,92,34,856 |
60 ఏళ్లు పైబడినవారు | మొదటి డోసు రెండో డోసు ముందు జాగ్రత్త డోసు | 12,63,13,709 11,16,53,849 93,60,680 |
ముందు జాగ్రత్త డోసులు | 1,95,66,729 | |
మొత్తం డోసులు | 1,76,52,31,385 |
గత 24 గంటల్లో 30,009 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,22,19,896 కు పెరిగింది.
దేశవ్యాప్త రికవరీ రేటు 98.46 శాతానికి చేరింది.
గత 24 గంటల్లో 14,148 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,48,359. ఇది మొత్తం కేసుల్లో 0.35 శాతం.
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,55,147 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.35 కోట్లకు పైగా ( 76,35,69,165 ) పరీక్షలు నిర్వహించారు.
వారపు పాజిటివిటీ రేటు 1.60 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.22 శాతంగా నమోదైంది.
Courtesy :Press Information Bureau , GOI